Sunday, 20 January 2019

గోశాల అనగానె ఆవుల పోషణ, సంరక్షణ మాత్రమే అనుకుంటాం. ఆవుల పెంపకం ద్వారా పాలు, పాల ఉత్పత్తులు పొందడమే అనుకుంటాం. కానీ గోశాలల నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేయవచ్చని, తద్వారా రసాయన అవశేషాలులేని పంటలను అందించవచ్చనీ ఈ గో(ప్రయోగ)శాలల ద్వారా అనుకుంటున్నాము
మంచిర్యాల మండలం శివలింగాపూర్ గ్రామంలో రెండెకరాల్లో చెన్నూరుకు చెందిన శ్రీ పోటు సత్యనారాయణ రెడ్డి(సి ఆర్ ఐ పొంపులు) వారిచే 2015లో గోశాలను ప్రారంభించారు. పాడి సంపద అంతరించిపోతున్న నేపథ్యంలో దేశవాళీ ఆవులను పోషించటంతో పాటు సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో గోశాలను ప్రారంభించారు. పది  ఆవులతో ప్రారంభమైన గోశాలలో ఇప్పుడు అరవై ఆవుల వరకు ఉన్నాయి. రైతులు సేంద్రియ సాగు చేసేలా మూత్రము పేడను తోటి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రెండెకరాల స్థలంలో ప్రారంభమైన గోశాల ప్రస్తుతం 25ఎకరాలకు విస్తరించింది. ఇందులో 15ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో మామిడి,కొబ్బరి, జమ, సపోటా, జొన్న, వరి ,నువ్వులు  పంటలను సాగు చేస్తున్నారు.


గోశాలలో ప్రతి సంవత్సరం రైతులకు ప్రకృతి సేద్యం, సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని, రసాయన ఎరువులు వాడటంతో భూసారం తగ్గి దిగుబడులు రాకపోవడం తో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి జీరో బడ్జెట్‌తో ప్రకృతి వ్యవసాయంలో వర్మీకంపోస్టు, ఆవు మూత్రం, ఆవు పేడ, జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రీయ ఎరువులను వాడాలని, దీని వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించే పద్దతులపై అవగాహన కల్పిస్తూ రైతులతో సేంద్రీయ వ్యవసాయం చేయిచాలి అనుకుంటున్నాము




No comments:

Post a Comment